APReporter.com

 

Latest News Headlines

 
ప్రజల సెంటిమెంటు వల్లే తెరాస గెలిచింది : పురంధరేశ్వరి E-mail
Saturday, 31 July 2010 17:56

purandareswariవిశాఖకు వచ్చిన కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి పురంధరేశ్వరి తెలంగాణ ఉప ఎన్నికలఫై ఈ విధంగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు బలంగా ఉందని, అందువల్లనే తెరాస గెలిచిందని అన్నారు. కాబట్టి తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉప ఎన్నికల ఫలితాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొని విశ్లేషిస్తుందని ఆమె తెలిపారు.

అలాగే జీవన్ రెడ్డి, శాసనసభ్యుడు పి.శంకరరావు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రజల సెంటిమెంటు బలంగా పని చేసిందని, అందువల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిందని, ఇకఫై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యతను తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.

 
మంచినీటి బిందువు వంటి జగన్ సేవలను పార్టీ వినియోగించుకోవాలి : అంబటి E-mail
Saturday, 31 July 2010 17:04

ambati_rambabuకాంగ్రెస్ బహిష్కృత నేత అంబటి రాంబాబు ఈ రోజు తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గాంధీ భవన్ లోని క్రమ శిక్షణా సంఘం వద్దకు రాగా అక్కడ సంఘం చైర్మన్ గానీ సభ్యులు గానీ లేకపోవడంఫై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ విధమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనప్పుడు, తనను సస్పెండ్ చేయడం అర్థరహితమని, తన సస్పెన్షన్ విషయంలో పార్టీ నిబంధనావళిని పాటించలేదని ఆయన ఆరోపించారు.

అసలు తనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం నుండి తనకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పకపోగా, తాను ఆయనకు రాసిన లేఖకు కుడా ఇంతవరకూ సమాధానం రాలేదని తెలిపారు.

ఈ సందర్భంలో అంబటి కడప ఎంపీ వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ " జగన్ ఉప్పునీటి సముద్రంలో మంచినీటి బిందువు వంటి వాడని, ఆయన సేవలను పార్టీ సరైన రేతిలో వినియోగించుకోవాలని " సూచించారు. అలాగే పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీనియర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 
అక్కినేని హీరోలతో కృష్ణవంశీ చిత్రం E-mail
Saturday, 31 July 2010 16:40

nagarjunaచంద్రలేఖ సినిమా తరువాత కృష్ణవంశీతో క్లాష్ రావడంతో అప్పటినుండి కృష్ణవంశీతో నటించని నాగార్జున, ఈ మధ్యనే అన్నీ మరచిపోయి ఒక మంచి సబ్జెక్ట్  రెడీ చెయ్యమని వంశీకి చెప్పాడట. అయితే కృష్ణవంశీ ఒక్క నాగార్జునకే కాక ఆయన తండ్రి నాగేశ్వరరావు మరియు తనయుడు నాగ చైతన్యకు కూడా సరిపోయే సబ్జెక్ట్ సిద్ధం చేసి నాగ్ కు వినిపించాడట. దాంతో మైండ్ బ్లాక్ అయిన నాగార్జున వెంటనే ఈ సినిమా చేద్దామనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాడట.

చందమామ చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబరులో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కాలంలో విడుదల చెయ్యడానికి కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుండీ అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

 
లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గుర్తింపును రద్దు చేసిన ఈసీ E-mail
Saturday, 31 July 2010 15:47

పలు రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనేసం 4 రాష్ట్రాల్లో అది గుర్తింపు పొంది ఉండాలి. అయితే కేంద్ర మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీకి బీహార్, నాగాలాండ్, మణిపూర్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో అది దారుణంగా వైఫల్యం చెందడంతో ఎన్నికల సంఘం ఆర్జేడీ పార్టీ గుర్తింపును ఈ రోజు రద్దు చేసింది.

దీనితో పాటు వివిధ రాష్ట్రాలలోని మరో ఐదు పార్టీల గుర్తింపును కూడా ఈసీ రద్దు చేసింది. వీటిలో తమిళనాడు వై.గోపాలస్వామి (వైగో) నేతృత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పుదుచ్చేరి శాఖ, జార్ఖండ్ ‌లో జేడీయూ మరియు మధ్యప్రదేశ్, ఉత్తరాంఛల్ రాష్ట్రాల్లోని సమాజ్‌వాదీ పార్టీలు కూడా తమ గుర్తింపును కోల్పయాయి.

 
మహేష్ తో మరోసారి రొమాన్స్ చేస్తానంటున్న ఇలియానా E-mail
Saturday, 31 July 2010 14:58

mahesh_ileana"పోకిరి" సినిమాతో హిట్ పెయిర్ గా పేరుపొందిన మహేష్ బాబు--ఇలియానా మరోసారి జత కట్టనున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "త్రీ ఇడియట్స్" చిత్రాన్నితెలుగు, తమిళ వర్షన్స్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జెమిని ఫిలిం సర్క్యూట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారన్న వార్తలు ఇప్పటికే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా ఇలియానా ఎంపికైనట్లు సమాచారం.

ప్రస్తుతం శంకర్ రజనీకాంత్   "రోబో" చిత్రంతో , మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో "ఖలేజా" సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక గోవా సుందరి ఇలియానా జూనియర్ ఎన్టీఆర్ "శక్తి"తో, విక్రమ్ "వేడి"తో పవన్ కళ్యాణ్ తో "ఖుషీగా" నటిస్తోంది. ఈ చిత్రాలు అయిన వెంటనే శంకర్ చిత్రం మొదలవనుంది.

 
డీఎస్ ఓటమి కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ విద్యార్ధి E-mail
Saturday, 31 July 2010 12:20

తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో విద్యార్ధి ఆత్మ బలిదానం చేశాడు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలం బసంతపూర్ కు చెందిన ఇషాన్ రెడ్డి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ పూర్తి చేసి జిఆర్ఇకి ప్రిపేరవుతున్నాడు. నిన్న రాత్రి ఇషాన్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇషాన్ తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలియజేస్తూ ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు.

అందులో పీసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఓడిపోతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నానని ఇషాన్ రాశాడు. అలాగే తన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఇషాన్ కోరాడు.

అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెదేపా నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ద్రోహులని ఇషాన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని, ఎవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

 
  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »


Page 1 of 103
Follow us on Twitter

Who's Online

We have 36 guests online