|
Wednesday, 08 September 2010 16:46 |
|
రాష్ట్రంలో ప్రభుత్వపాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన అంతర్గత వ్యవహారాలతో ప్రజాపాలనను మరచిపోయిందని, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చిరంజీవి విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని చిరంజీవి చెప్పారు. ప్రజాధనాన్ని కొందరు బడా నాయకులు లూటీ చేశారని, వారిని ప్రజలముందు నిలబెట్టాలని చిరంజీవి డిమాండ్ చేశారు.
|