|
Saturday, 31 July 2010 10:47 |
|
తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్ధులు గెలుపొందడంఫై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని నిన్న ఢిల్లీలో మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారో, వారినే ఆ ప్రాంత ఓటర్లు తిరిగి గెలిపించారని మొయిలీ అభిప్రాయపడ్డారు.
తెరాస అభ్యర్ధులు గెలవడానికి అక్కడి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని, ఈ ఫలితాలఫై మరింత లోతుగా మాట్లాడేందుకు ఏమీ లేదని చెబుతూ మొయిలీ ఈ విషయంఫై ఇంకా మాట్లాడేందుకు నిరాకరించారు.
|