APReporter.com

 
కాంగ్రెస్--తెదేపాల చెంప చెళ్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చారు : కేసీఆర్ E-mail
Saturday, 31 July 2010 11:25

kcrఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించడంఫై తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ తమ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్---తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి ఎన్నో ఎత్తులు వేశాయని, అయితే తెలంగాణ ప్రజలు వారి కళ్ళు గిర్రున తిరిగేలా, చెంప ఛెళ్లుమనిపించేలా, అది ఢిల్లీ పీఠానికి వినబడేలా తమ తీర్పునిచ్చారని అన్నారు. ఈ గెలుపునకు కృషి చేసిన తెలంగాణ అక్కాచెల్లెళ్లకు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు మరియు ప్రభుత్వోద్యోగులకు కే సీ ఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి దాన్ని ఓట్లుగా మలచి గెలిపించారని, ఇకఫై తెలంగాణా రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, ఇదే స్ఫూర్తిని తెలంగాణా ప్రజలు రాష్ట్ర విభజన జరిగే వరకూ కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెరాస సాధించిన భారీ విజయాన్ని తెలుసుకుని ప్రపంచంలోని 18 దేశాలలో ఉన్న తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని, అమెరికాలో శెలవు దొరకకపోయినా, బలవంతంగా శెలవు పెట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నట్లు వారు తనతో చెప్పారని కేసీఆర్ తెలిపారు.

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో పర్యటించకుండానే ఇక్కడి ప్రజలు ఈ గెలుపుతో ఏకగ్రీవంగా తమ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు కనులు తెరిచి, ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకుని, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

 
Follow us on Twitter

Who's Online

We have 55 guests online

Advertisement