మొహాలీలో జరుగుతున్న భారత్, పాక్ సెమీ ఫైనల్లో సెహ్వాగ్ పాక్పై తన వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆటను ఫోర్ కొట్టి ప్రారంభించాడు. కాగా సెహ్వాగ్ ఫోర్తో ఆటను ప్రారంభించడం ఇది వరుసగా ఆరోసారి. గుల్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టాడు. మంచి ఊపులో ఉన్న సెహ్వాగ్ (24 బంతుల్లో 9 ఫోర్లతో 38) రియాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సెహ్వాగ్ స్థానంలో గంభీర్ బ్యాటింగ్కు దిగాడు. సచిన్ నిలకడగా ఆడుతున్నాడు. భారత్ స్కోరు 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు.
| < Prev | Next > |
|---|









