|
Monday, 06 September 2010 10:41 |
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో గిలగిలలాడుతున్న పాక్ కు మరో గట్టి షాక్ తగిలింది. తమ జట్టులోని ఆటగాళ్ళందరూ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆ జట్టు ఓపెనర్ యాసిర్ హమీద్ "ది న్యూస్ అఫ్ ద వరల్డ్ " కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తమ జట్టులో అందరూ ఫిక్సర్లేనని
|
|
Read more...
|
|
Monday, 06 September 2010 10:17 |
ఆదివారం జరిగిన గ్రూప్-1 పరీక్షల గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ విలేఖరులతో మాట్లాడుతూ తుపాకీల నీడలో ఇలా పరీక్షలు రాయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని, పరీక్ష ప్రారంభమైన 10 నిముషాలకే ప్రశ్నా పత్రం లీకైందని, కనుక ఈ పరీక్షను అనుమతించకుండా వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో లెంపలేసుకుని
|
|
Read more...
|
|
Sunday, 05 September 2010 12:03 |
|
ఓయూ బీఈడీ సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్ధులు పోలిసులఫై విరుచుకుపడి ఒక్కసారిగా రాళ్ళతో దాడి చెయ్యడంతో పోలీసులు వారిఫై భాష్ప వాయువును ప్రయోగించారు. ఇంకా ఆందోళన చేస్తున్న కొందరు నేతలను అరెస్టు చేయడంతో పాటు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఫై పోలీసులు చెయ్యి చేసుకున్నారు. ఓయూ బీఈడీ సెంటర్లోకి దూసుకెళ్లిన తెలంగాణ విద్యార్ధులు పరీక్ష రాస్తున్న వారి వద్ద నుండి ప్రశ్నా పత్రాలను బయటకు తెచ్చి వాటిని చించివేశారు.
దీనితో పరీక్ష రాస్తున్న విద్యార్ధులు పోలిసుల బందోబస్తు సరిగ్గా లేకపోవడం వల్లే తాము పరీక్ష రాయలేకపోయామని ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆయా విద్యార్ధులకు మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఓయూ బీఈడీ పరీక్షా కేంద్రాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.
|
|
Sunday, 05 September 2010 11:34 |
|
గ్రూప్-1 ఉద్యోగాల్లో తమ తెలంగాణ వాటా తేల్చేంత వరకూ గ్రూప్-1 పరీక్షలను జరగనివ్వమని గతరాత్రి నుండే తెలంగాణ జెఎసి నేతలు, విద్యార్ధులు ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు పరీక్షను జరగనిచ్చేది లేదంటూ తెలంగాణ ప్రాంతంలో బంద్ నిర్వహించడమే కాక పలు పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం.
పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా తెలంగాణ కార్యకర్తలు పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఆపి అద్దాలను పగులగొట్టడంతో పాటు కొన్ని బస్సులను తగులబెట్టారు. హైదరాబాద్ లో పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్ధి హాల్ టికెట్ కూడా చించివేయడంతో అతను కన్నీరు పెట్టుకున్నాడు.
|
|
Saturday, 04 September 2010 17:00 |
|
పవన్ కళ్యాణ్ జల్సా తరువాత రెండున్నర్ర సంవత్సరాలకి రిలీజవుతున్న 'కొమరం పులి" సినిమా కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు మళ్ళీ నిరాశే మిగిలింది. ఎన్నో కారణాల వల్ల ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వచ్చిన కొమరం పులి ఈ నెల 9 వ తేదీన విడుదలవుతుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రానికి చెన్నై కోర్టు స్టే విధించింది
|
|
Read more...
|