Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్!

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశాల్లో భారత్ హవా పెరిగింది. వాల్‌స్ట్రీట్ ఆక్యుపై, అరబ్ విప్లవానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ఇతోధికంగా ఉపయోగపడడం, ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ తదితర అంశాలపై కూడా చర్చలు జరిగాయి. యూరప్ సంక్షోభం నేపథ్యంలో నిరాశావహంగా మొదలైన ఈ సదస్సు భారత్, చైనాలు మెరుపులు మెరిపిస్తున్నాయని ఆశావహ వాతావరణంలో ముగిసింది.

ఈ ఏడాదిలో ఉద్యోగ కల్పన, పెరుగుతున్న ఆదాయ అసమానతలు, అధికంగా ఉన్న ఇంధనం ధరలు, భారత్ వంటి వృద్ధి చెందుతున్న దేశాలు.. వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందని ఈ సదస్సులో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వాలు, కంపెనీలు ఉద్యోగాలనివ్వాలనే సందేశాన్ని ఈ సదస్సు ఇచ్చింది.