ప్రభుత్వరంగ దిగ్గజం కోల్ ఇండియా(సీఐఎల్)కి సీఎండీ బాధ్యతలను తొలిసారిగా ఒక మహిళా అధికారి చేపట్టనున్నారు. బొగ్గు శాఖలో అదనపు కార్యదర్శి అయిన జోహ్రా చటర్జీ నేడు ఆ కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతల కింద ఈ స్థానంలో కొనసాగిన ఎన్సీ ఝా పదవీకాలం మంగళవారంతో ముగిసినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన జోహ్రా చటర్జీ ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వ నామినీ డెరైక్టర్గా కూడా ఉన్నారు.
| < Prev | Next > |
|---|


