ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.10 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్య సాధనకు పన్ను అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. కస్టమ్స్ చట్టం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఇక్కడ గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రణబ్ 2012 కస్టమ్స్ మాన్యువల్, కస్టమ్స్ ట్రైనింగ్ మాన్యువల్ను ఆవిష్కరించారు. సీబీఈసీ చైర్మన్ ఎస్కే గోయెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, తమ బోర్డు ముందు ఉన్న దాదాపు రూ. 4 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్య సాధనలో డిసెంబర్ నాటికి 70 శాతం సాధించినట్లు వివరించారు.
| < Prev | Next > |
|---|


