Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ప్రత్యేక పాత్రలో పోసాని కృష్ణమురళి

రమేష్‌బాబు, ప్రియాంక, పరమేష్, మోహన ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘టు-లెట్’. పోసాని కృష్ణమురళి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. గెంటెం వేణుగోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ 'హారర్ చిత్రాల్లో ఇదొక వినూత్న ప్రయత్నం. కృష్ణమురళి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం' అని తెలిపారు.

‘ఛత్రపతి’ శేఖర్, ‘చిత్రం’ శ్రీను, కోట శంకరరావు, మణిగొగ్గా, విజయ్‌బాబు, ఆర్తికార్కి, విజయ భాస్కర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.