Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

18న వస్తున్న 'పూలరంగడు'

సునీల్, ఇషాచావ్లా జంటగా నటించిన 'పూలరంగడు' చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కే.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ తో 'అహా నా పెళ్ళంట' చిత్రాన్ని తీసిన వీరభద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'ఆనూప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది.

త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న సునీల్ 'పూలరంగడు'లో కొత్త యాంగిల్ లో కనిపించబోతున్నారు. సునీల్ కెరీర్ లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.