Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

'నెక్' మెంబర్ గా ఎన్నికయిన నిర్మాత గణేష్

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్', ఎన్టీఅర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని ఇలా స్టార్ హీరోలందరితో భారీ చిత్రాల్ని నిర్మిస్తున్న అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ(ఎన్.ఇ.సి.సి)కి మెంబర్ గా ఎంపికయ్యారు.

ఈ సందర్బంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ 'అందరి సహకారంతో చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాత పేరు సంపాదించుకున్న నేను నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీకి మెంబర్ గా ఎంపిక కావడం చాలా ఆనందంగా వుంది. 2012 నుండి 2017 వరకు ఐదేళ్ళపాటు నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా నా సేవల్ని అందిస్తాను' అన్నారు.