Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

అనారోగ్యంతో కేరళ గవర్నర్ ఫరూఖ్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ గవర్నర్ ఎంవోహెచ్ ఫరూఖ్ (74) అనారోగ్యంతో గురువారం రాత్రి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా ఇక్కడి ఆపోలో ఆస్పత్రిలో కిడ్నీ, ఇతర సమస్యలకు చికిత్స పొందుతున్నారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫరూఖ్ పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేశారు.

పార్లమెంట్ సభ్యుడిగా మూడు సార్లు ఎన్నికయ్యారు. సౌదీ అరేబియాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేరళ 19వ గవర్నర్‌గా గత ఏడాది సెప్టెంబర్‌లో నియమితులయ్యారు. ఫరూఖ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియా, కేరళ సీఎం చాందీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత సంతాపం తెలిపారు.