Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లో 117 స్థానాలకు గాను 1,078 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కోటీ 76 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 19 వేలా 841 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 200 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు.

శిరోమణి అకాళీదళ్‌-బిజెపి సంకీర్ణం, కాంగ్రెస్‌, బిఎస్‌పి అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని 70 నియోజక వర్గాల్లో 788 మంది అభ్యర్థులు పోటీ పడ్తున్నారు. 63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 75 కంపెనీల పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి.