అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబర్ 23వ తేదిన పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఫలముగా భగవాన్ సత్యసాయి జన్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పిదప స్వామి జన్మించడం తో ఆయన తల్లితండ్రులు ఆయనకు సత్యనారాయణ రాజు అని నామకరణం చేసారు. బాబా పసికందుగా ఉన్నప్పటి నుండే అనేకమైన అద్బుతాలు జరిగాయని అంటారు. ఆయన పుట్టిన తరుణంలో ఇంటిలోని సంగీత వాద్యాలు వాటంతటవే మ్రోగాయట. బాబా జననం తరువాత ఈశ్వరమ్మ పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని ఇది ఆ అవతార పురుషుడి లీలగా భక్తులు చెబుతారు.
బాబా చిన్న తనం నుండి ఆధ్యాత్మిక స్మరణలో ఉండేవారట. తనతో చదువుకొనే తోటి విద్యార్దులకు ఎప్పుడూ ఆత్యధ్మిక బోధనలు చేసేవారు. పురాతన శ్లోకాలను అవలీలగా చెప్పేవారట. ఎప్పుడూ ఏకాగ్రతతో మౌనంగా ఉండేవారని తినే ఆహారంపై కూడా ఎప్పుడూ ఆసక్తి చూపేవారు కాదని భక్తులు చెబుతారు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు తన 14వ ఏట 1940 మార్చి 28వ తేదీన తను షిర్డీ సాయిబాబా అవతారమని ప్రకటించారు. "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పి తన చదువుకు స్వస్టి పలికారట. ఆతరువాత దాదాపుగా మూడేళ్ళు పాటు ఒక పొలంలో ధ్యానం చేసారట. అప్పటినుండి ఆయనకు భక్తులు పెరగడం మొదలు పెట్టారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు చుట్టుపక్కల గ్రామాలను, రాష్ట్రాలనే కాకుండా సుమారు 150 దేశాల ప్రజలను ఆకర్షించింది. పదుల్లో మొదలైన భక్తుల సంఖ్య కోట్లల్లో కి పెరింగింది. నిరుపెదైన, కోటీశ్వరుడైన బాబాకి సమానమే. నిరుపేదైన దేశాలను ఏలే రాజైన బాబాకు భక్తులుగా మారిపోయారు.
ఒక్కప్పుడు పుట్టపర్తి గ్రామంలో బస్సు సౌకర్యం కూడా లేదు. కానీ ఇప్పుడు అదో అద్బుతమైన ఆత్యధ్మిక కేంద్రం. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణా కేంద్రం. ఏంతో మందికి ఉచితంగా చదువు చెబుతున్న విద్యా నిలయం. నిత్యం బాబా స్మరణతో, ఆత్యధ్మిక బోధనలతో అలరారుతున్నఒక ప్రశాంతమైన నిలయం. తన తల్లి ఈశ్వరమ్మ కోరిక మేరకు 1954 లోనే 12 పడకలతో ఒక ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్మిచారు. "సత్యసాయి ట్రస్ట్" ద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆసుపత్రి ని ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో అభివృద్ధి చేసారు. ఇక్కడ పేద ప్రజలకు లక్షల విలువచేసే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. వైద్యంతో పాటు అక్కడికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించడం, వారిని అన్నివిదాల కరుణతో చూడడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఈ ఆసుపత్రికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లబించింది.
సత్య సాయి సేవా కార్యక్రమాల్లో మరో ముక్యమైనది "సత్యసాయి మంచినీటి పధకం". తాగునీటి కోసం పరితపిస్తున్నకొన్ని ప్రాంతాలను ఆయన దత్తతికి తీసుకున్నారు. దాదాపుగా 1300 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాంతాలవారి దాహార్తిని తీర్చి సత్య సాయి కరుణామూర్తిగా కీర్తించబడ్డాడు. ఒకానొక సమయంలో ఈ పధకానికి డబ్బు లేక పోవటంతో ట్రస్ట్ ఆస్తులను బ్యాంక్ లో తనకా పెట్టి లోన్ ద్వారా డబ్బు సేకరించి మంచినీటి పధకాలను పూర్తీ చేసారు సత్య సాయి. ఈ పతకాలను కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చెయ్యకుండా ప్రక్క రాష్ట్రమైన తమిళనాడు కి కూడా ఈ మంచినీటి పధకంతో దాహార్తిని తీర్చారు.
మరో ముక్యమైన సేవాకార్యక్రమం ఉచిత విధ్య. ముందుగా చెప్పుకున్నట్లు, పుట్టపర్తి ఒక సరస్వతి నిలయం. ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు. పేద, ధనిక అనే బేదం ఉండదు. ఒకటే లక్యం, "నేటి బాలను రేపటి ఉత్తమ పౌరులుగా" తీర్చి దిద్దడం. ఆద్యాత్మికతో కూడిన ఉన్నత ప్రమాణాలతో అత్యున్నతమైన మైన విద్యను విలువలను జోడించి బోదిస్తారు. "మానవసేవే మాధవసేవ" అనే తత్వాన్ని వీరికి బోదించడం ద్వారా వీరిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
ఒక వ్యక్తిని భగవంతుని గా కొలవడానికి ఆయనకు అద్బుత శక్తులు అవసరంలేదు. దయాగుణం, కరుణ, ప్రేమ కలిగిన వారెవరైనా భగవంతునితో సమానమే. అలంటి వారిలో "సత్య సాయి" ఒకరని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎంతోమందికి ప్రేమను పంచిన కరుణామూర్తి సత్య సాయిబాబా. ఈయన మరణం అసత్యం. మరణించింది కేవలం ఈయన శరీరం మాత్రమే కానీ ఈయన పంచిన ప్రేమ కాదు, ఆయన ఆత్మ మన శ్వాసలో కలిసిపోయింది. అంటే ప్రతీ ఒక్కరూ ఆయన ఏమైతే కోరుకున్నారో, ఏ ప్రేమనైతే పంచి వెళ్ళారో వాటిని పాటించాలి.
| Next > |
|---|


