Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం

ఆస్ట్రేలియాలో వరుస పరాజయాలు చూస్తున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. పెర్త్‌లో ముగిసిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనిపై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడింది. కనీస పరిమితికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది కాలంలో భారత్ స్లో ఓవర్ రేటును ఎదుర్కోవడం ఇది రెండోసారి. గత జూన్‌లో ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్ ఓ టెస్టు నిషేధం ఎదుర్కొంటాడు.

గతంలో ఇది మూడు సార్లుగా ఉండేది. ధోని మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించగా ఆటగాళ్ల ఫీజులో 20 శాతం విధించారు. దీంతో అడిలైడ్‌లో సెహ్వాగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. వృద్ధిమాన్ సాహా కీపర్‌గా వ్యవహరించే అవకాశముంది.