Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

లాంచనం ముగిసింది : భారత్ పరాజయం పరిపూర్ణం

ఆస్ట్రేలియాలో భారత్ పరాజయం పరిపూర్ణమయింది. వల్డ్‌ ఫేమస్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ కుప్ప కూలింది. ఫలితంగా అడిలైడ్‌ టెస్ట్‌లో భారత్ 201 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లయాన్ 4, హారిస్ 3 వికెట్లు పడగొట్టారు. సిడిల్ కు 'మాన్ అఫ్ ది మ్యాచ్' లభించింది.

 

ఈ సిరిస్ లో ఒక త్రిపుల్ సెంచరీ, ఒక డబుల్ సెంచరీతో రాణించిన కెప్టెన్ క్లార్క్ కు 'మాన్ అఫ్ ది సిరీస్' లభించింది. దాంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్‌లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఓడిన టీమిండియా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అదే మార్జిన్‌తో ఓటమి పాలైంది. ఈ వరుస ఓటముల నేపథ్యంలో గత ఏడాది నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో వున్న టీమిండియా తాజాగా, మూడో ర్యాంక్‌కు దిగజారింది. ప్రపంచ ర్యాంకుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో వున్న భారత్ జట్టు విదేశీ గడ్డపై వరుస ఓటముల పాలవడం ఇదే ప్రథమం.