ఆసీస్ టూర్లో అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా బ్యాట్స్మెన్కు ఇంఛార్జి కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు లభించింది. ఈ ఓటమికి ఎవరూ కుంగిపోయి రిటైరవ్వాల్సిన అవసరం లేదంటూ ఆటగాళ్లను అతను వెనకేసుకు వచ్చాడు. ఆస్ట్రేలియాలో 0-4 ఓటమి ప్రస్తావనకు ఇండియాలో 2-0 విజయం సాధించామని సెహ్వాగ్ సమాధానమిచ్చాడు. కొన్నేళ్లుగా ఇండియా బ్యాటింగ్ బ్రహ్మాండంగా వుందని, ఈ రెండు టూర్లలో బ్యాట్స్మెన్ విఫలమయ్యారని చెప్పాడు. ఆటగాళ్లు వ్యక్తిగతంగా రాణిస్తే, జట్టు మూడు, నాలుగు వందల స్కోర్ చేస్తుందని వీరూ అన్నాడు.
| < Prev | Next > |
|---|


