స్వదేశంలో వచ్చే నెలలో జరిగే లండన్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన యెండల సౌందర్య 18 మంది సభ్యులుగల జట్టులో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో క్రీడాకారిణి, గోల్కీపర్ రజని రిజర్వు గోల్ కీపర్ గా ఎన్నికయింది. మిడ్ఫీల్డర్ అసుంతా లాక్రా జట్టుకు నేతృత్వం వహిస్తుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీలో భారత్తోపాటు ఉక్రెయిన్, కెనడా, పోలెండ్, దక్షిణాఫ్రికా, ఇటలీ పాల్గొంటాయి. విజేతగా నిలిచిన జట్టు మాత్రమే లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది.
| < Prev | Next > |
|---|


