విదేశాల్లో వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా యువ క్రికెటర్లకు భారత్లో అత్యంత వేగవంతమైన పిచ్గా పేరుగాంచిన ధర్మశాల పిచ్పై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు వారాల పాటు ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేయనుంది. దేశంలోని బీసీసీఐ అకాడమీల నుంచి ఎంపిక చేసిన యువ క్రికెటర్లు ఈ క్యాంప్లో తమ నైపుణ్యానికి పదును పెట్టుకోనున్నారు. ఇటీవల ముగిసిన జాతీయ క్రికెట్ అకాడమీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
| < Prev | Next > |
|---|


