Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

పారదర్శకత ఉంటే వ్యతిరేకత ఎందుకు : మాకెన్

కేంద్ర క్రీడల మంత్రి అజయ్ మాకెన్ మళ్ళీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)పై ధ్వజమెత్తారు. బోర్డు కార్యకలాపాలలో పారదర్శకత ఉంటే క్రీడా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించా రు. ‘క్రీడా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశంపై బీసీసీఐ మా మంత్రిత్వ శాఖకు 27 పేజీల లేఖను పంపింది. ఆర్‌టీఐ (సమాచార హక్కు చట్టం)కి భయపడనప్పుడు, పారదర్శకంగా ఉన్నప్పుడు బోర్డు బిల్లును ఎందుకు అడ్డుకుంటుందో నాకు అర్థం కావడం లేదు.

వీటి పరిధిలోకి రావడానికి వాళ్లు ఇంకా సిద్ధం కాలేదా? అన్ని వ్యవస్థల్లో పారదర్శకతను తీసుకురావడమే క్రీడా బిల్లు ప్రధాన ఉద్దేశం' అన్నారు.