Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఇంగ్లాండ్ నెంబర్ వన్ ర్యాంక్ నిలిచేనా..?

టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ గా చెలామణి అవుతున్న ఇంగ్లాండ్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ లలో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ర్యాంక్ దిగజారే ప్రమాదముంది. ఇంగ్లండ్... పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. ముఖ్యంగా దుబాయ్ పిచ్‌పై చెలరేగుతున్న స్పిన్నర్ అజ్మల్, అబ్దుల్ రెహమాన్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అజ్మల్ 17 వికెట్లు తీస్తే, రెహమాన్ 12 వికెట్లు పడగొట్టాడు.

కాబట్టి ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇదే విషయాన్ని కెప్టెన్ స్ట్రాస్ కూడా అంగీకరించాడు. వికెట్‌ను బట్టి ఆటతీరును మార్చుకోవాలని సహచరులకు సూచించడంతో పాటు ఈ మ్యాచ్‌లో గేమ్‌ప్లాన్ కూడా మారుస్తామని చెప్పాడు. మరోవైపు ఊపు మీదున్న పాకిస్తాన్ ఈ మ్యాచ్ కూడా గెలిచి ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేయాలని చూస్తుంది.