ముంబై రంజీ జట్టు కెప్టెన్సీకి సీనియర్ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ రాజీనామా చేశాడు. గత రెండేళ్లుగా రంజీల్లో ముంబై టైటిల్ నెగ్గకపోవడంతో బాధ్యత వహిస్తూ జాఫర్ గురువారం సారథ్యానికి గుడ్బై చెప్పాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడు. నాలుగేళ్ల పాటు సారథ్యం వహించిన జాఫర్ 2008-09, 2009-10లలో ముంబైని రంజీ చాంపియన్గా నిలిపాడు. బ్యాటింగ్పై ఎక్కువ శ్రద్ద కనబరిచేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని అతను చెప్పినట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వర్గాలు తెలిపాయి.
| Next > |
|---|


