Telugu News

 
పాకిస్థాన్ లో భారీ వరదలకు 400 మంది మృతి E-mail
Saturday, 31 July 2010 15:28

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాకిస్థాన్ నీట మునిగింది. వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతుండడంతో పాకిస్థాన్ లో అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు, పలు గ్రామాలలోని గృహాలు వరద నీటిలో కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే పాకిస్థాన్ లో 400 మంది మరణించగా, మరో 4లక్షల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు.

అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వరదల కారణంగా 60 మంది మృతి చెందారు. ఈ వరదల కారణంగా పాకిస్థాన్ లోని రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గత 80 ఏళ్ళ తరువాత ఇంతటి భారీ వరదలు రావడం ఇదే ప్రప్రధమమని పాక్ అధికారులు తెలిపారు.

 
Follow us on Twitter

Who's Online

We have 28 guests online

Advertisement