Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

విజయసాయిరెడ్డికి 31 వరకు రిమాండ్

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డికి నాంపల్లి కోర్టు ఈనెల 31 వరకూ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ నిన్నటితో ముగియటంతో ఆయన్ని అధికారులు మంగళవారం ఉదయం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

విచారణ అనంతరం ఈ నెలాఖరు వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. కాగా జైలులో ల్యాప్ టాప్ వాడుకునేందుకు అనుమతివ్వాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది.