తాను ముఖ్యమంత్రిని అయితే వ్యాట్(విలువ ఆధారిత పన్ను) రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో వ్యాట్ పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. వారికి ప్రజల దుస్థితి పట్టడం లేదన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.1400 పడుతుందన్నారు.
| < Prev | Next > |
|---|


