జూనియర్ డాక్టర్ల సమస్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. జూడాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ దాడి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఉదయం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వాహనాన్ని సీఎం భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాగా అదే సమయంలో ప్రముఖ నిర్మాత రామానాయుడుకు లోనికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇచ్చారు.
| < Prev | Next > |
|---|


