Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

కిరణ్ సర్కార్ కూలిపోవడం ఖాయం : కోదండరాం

కిరణ్ ప్రభుత్వం అవసానదశలో ఉందని, ఎప్పుడైనా కూలిపోవచ్చని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం జోస్యం చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఉసురుపోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. సీఎం, డీజీపీల ఆదేశాల మేరకే ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. కేసులెత్తేస్తామని అసెంబ్లీలో చెప్పి, ఒక్కో వ్యక్తిపై ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించినట్లు తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసంచేస్తే బాధ్యులను అరెస్టు చేయలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. వస్త్రవ్యాపారంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని,  వ్యాట్‌ను ఐదుశాతం విధిస్తే ఈ వ్యాపారంపై ఆధారపడిన వారంతా నష్టపోతారన్నారు. సీఎం రోజూ పత్రికలకిచ్చే ప్రకటనలను ఆపివేస్తే వ్యాట్‌పై వచ్చే రూ.200 కోట్లు సమకూరుతాయని పేర్కొన్నారు.